Kurnool: సౌదీలో ఆదోని మహిళ ఇక్కట్లు
ABN , Publish Date - May 28 , 2025 | 07:01 AM
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఆశాబీ వీసా గడువు ముగియడంతో సౌదీలో చిక్కుకుంది. తెలుగు ప్రవాసీ సంఘం ‘సాటా’ అధ్యక్షుడు పల్లెం తేజ介ుల సహకారంతో ఆమెను స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదుకున్న ‘సాటా’ అధ్యక్షుడు తేజ
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 51 ఏళ్ల షేక్ ఆశాబీ ఒక ఏజెంట్ను నమ్మి సందర్శక వీసాపై ఏడాది క్రితం సౌదీ అరేబియాకు వచ్చింది. ఒప్పందం ప్రకారం ఉద్యోగ కాలపరిమితి ముగియగానే ఆమె స్వదేశానికి వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు చేరుకుంది. వీసా గడువు ముగియడంతో సిబ్బంది ఆమెను వెనక్కి పంపించారు. దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న ఆశాబీను గుర్తించిన కొందరు భారతీయులు తెలుగు ప్రవాసీ సంఘం ‘సాటా’ అధ్యక్షుడు పల్లెం తేజకు వివరించారు. స్పందించిన ఆయన ఆశాబీకి ఆశ్రయం కల్పించారు. వీసా ఉల్లంఘన జరిమాన చెల్లించి స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News