టీటీడీ నిత్యాన్నదాన పథకానికి కూరగాయల వితరణ
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:15 AM
తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి శ్రీరామచంద్రనగర్ కాలనీ నుంచి ఆదివారం దాతలు వడ్లపట్ల నాగేశ్వరరావు, సామ్రాజ్యం దంపతులు, కుటుంబ సభ్యులు అట్లూరి వెంకట రవీంద్ర, హరిత దంపతులు, తూమాటి సత్యచంద్రశేఖర్, జ్యోతి దంపతుల సహకారంతో 11టన్నుల కూరగాయలను పంపించారు.
టీటీడీ నిత్యాన్నదాన పథకానికి
కూరగాయల వితరణ
భారతీనగర్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి శ్రీరామచంద్రనగర్ కాలనీ నుంచి ఆదివారం దాతలు వడ్లపట్ల నాగేశ్వరరావు, సామ్రాజ్యం దంపతులు, కుటుంబ సభ్యులు అట్లూరి వెంకట రవీంద్ర, హరిత దంపతులు, తూమాటి సత్యచంద్రశేఖర్, జ్యోతి దంపతుల సహకారంతో 11టన్నుల కూరగాయలను పంపించారు. కూరగాయల లారీని దాతలు అట్లూరి వెంకట రవీంద్ర, హరిత దంపతులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దాతల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.