గ్యాస్ సిలిండర్లపై పెంచిన రూ.50 తగ్గించాలి
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:24 AM
వంట గ్యాస్ సిలిండర్లపై పెంచిన రూ.50 తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): పెట్రోలు, డీజీల్పై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలని, వంట గ్యాస్ సిలిండర్లపై పెంచిన రూ.50 తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సీపీఎం నగర కార్యదర్శి బి.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బుధవారం కోనేరుసెంటర్లో వారు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ జయరావు, టి.చంద్రపాల్, ఎండీ యూనస్, ఎస్.ధనుంజయరావు, ఐద్వా అధ్యక్షురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.