Share News

కేయూ రెక్టార్‌ బసవేశ్వరరావుకు అరుదైన గౌరవం

ABN , Publish Date - May 10 , 2025 | 12:55 AM

కృష్ణా యూనివర్సిటీ(కేయూ) రెక్టార్‌ మండవ వెంకట బసవేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది.

కేయూ రెక్టార్‌ బసవేశ్వరరావుకు అరుదైన గౌరవం
సభ్యత్వ పత్రాన్ని అందుకుంటున్న రెక్టార్‌ ఎంవీ బసవేశ్వరరావు

జీవితకాల సభ్యత్వం ఇచ్చిన వాషింగ్టన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌

మచిలీపట్నం, మే 9(ఆంధ్రజ్యోతి): కృష్ణా యూనివర్సిటీ(కేయూ) రెక్టార్‌ మండవ వెంకట బసవేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో 1898లో స్థాపించిన వాషింగ్టన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ఆయనకు జీవితకాల సభ్యత్వం లభించింది. శుక్రవారం అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో అకా డమీ అధికారులు సభ్యత్వ పత్రాన్ని అందజేశారు. గతంలో ఆంధ్రా, నాగార్జున యూనివర్సిటీలలో పనిచేసిన ఆయన, ప్రస్తుతం కేయూలో రెక్టార్‌గా పని చేస్తు న్నారు. సైన్స్‌ విభాగంలో ఇప్పటివరకు 481 పరిశోధనాపత్రాలను ఆయన వెలు వరించారు. 54మందికి పీహెచ్‌డీ చేసేందుకు గైడ్‌గా వ్యవహరించారు. బసవే శ్వరరావు ప్రతిభను గుర్తించిన వాషింగ్టన్‌ అకాడమీ సభ్యత్వమిచ్చిగౌరవించింది.

Updated Date - May 10 , 2025 | 12:55 AM