రేషన్ షాపుల తనిఖీకి సరికొత్త యాప్
ABN , Publish Date - May 10 , 2025 | 12:53 AM
ప్రజాపంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇన్స్పెక్షన్ యాప్ ను తీసుకొచ్చింది.

మొగల్రాజపురం, మే 9(ఆంధ్రజ్యోతి): ప్రజాపంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇన్స్పెక్షన్ యాప్ ను తీసుకొచ్చింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్గౌర్ అదేశాల మేరకు కమిషనరేట్ అధికారులు ముత్యాల ప్రసాద్, కుమార్, ఏఎస్వో-2 శ్రీనివాసులు నగరంలో సర్కిల్-2 పరిధిలోని సత్యనారాయణపురం, చుట్టుగుంట, కృష్ణలంకలోని ఐదు రేషన్ షాపుల్లో యాప్ పనితీరును పరిశీలించారు. రేషన్షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లు, పెట్రోల్ బంకులు, గోడౌన్లు తనిఖీ చేయడం ద్వారా ఆన్లైన్లో, క్షేత్రస్థాయిలో స్టాకుకు మధ్య తేడాలు, షాపులు ఎవరు నిర్వహిస్తున్నారు వంటివి ఈ యాప్ ద్వారా తనిఖీ చేయొచ్చని అధికారి ప్రసాద్ తెలిపారు. పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నారు. చెకింగ్ ఇన్స్పెక్టర్లు మణికంఠ, భగీరథ పాల్గొన్నారు.