Share News

9వ రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:21 AM

జీతాలపెంపు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) నగరకమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం తొమ్మిదో రోజుకు చేరింది.

 9వ రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె
వేపాకులు కట్టుకుని మోకాళ్లపై నిలబడి కార్మికుల నిరసన

ధర్నాచౌక్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జీతాలపెంపు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) నగరకమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం తొమ్మిదో రోజుకు చేరింది. ధర్నాచౌక్‌లో కార్మికులు వేపాకులు కట్టుకుని, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ చర్చల పేరుతో కాలయాపన చేయకుండా జీతాల పెంపునకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జ్యోతిబసు, స్టీఫెన్‌బాబు, టి.ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:21 AM