టీడీపీ బలోపేతానికి కృషి చేద్దాం
ABN , Publish Date - May 06 , 2025 | 12:45 AM
టీడీపీ బలోపేతానికి ఐక్యంగా శక్తి వంచన లేకుం డా కృషి చేద్దామని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.
పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపు
రెడ్డిగూడెం, మే 5 (ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతానికి ఐక్యంగా శక్తి వంచన లేకుం డా కృషి చేద్దామని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. టీడీపీ సం స్థాగత ఎన్నికల నేపథ్యంలో రెడ్డిగూడెంలో సోమవారం ఆయన టీడీపీ కుటుంబ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్ను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉజ్వలంగా తీర్చిదిద్దుతుందన్నారు. నాయకులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి, కె.విజయబా బు, జంపాల సీతారామయ్య, ఉయ్యూరు వెంకట నరసింహారావు, నాదెళ్ల చెన్నకేశవరావు, జానలపాటి వేణుగోపాల్రెడ్డి, కుప్పిరెడ్డి అశోక్రెడ్డి, చే బ్రోలు రాజు, బాణావత్ రమేష్, రాయుడు వెంకటేశ్వరరావవు, పాలంకి మోహన్ మురళీరెడ్డి పాల్గొన్నారు.
వేమిరెడ్డి కృష్ణారెడ్డి మృతి టీడీపీకి తీరనిలోటు
మైలవరంరూరల్, మే 5(ఆంధ్రజ్యోతి): టీడీపీ వెల్వడం గ్రామ యూనిట్ ఇన్చార్జి వేమిరెడ్డి కృష్ణారెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. సోమవారం వెల్వడంలోని కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. నాయకులు జంపాల సీతారామయ్య, ఉయ్యూరు నరసింహారావు, లంకా లితీష్, ప్రభాకర్ ఆయన వెంట ఉన్నారు.