స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రపై ప్రజలను చైతన్యవంతులను చేద్దాం
ABN , Publish Date - May 18 , 2025 | 01:32 AM
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధిగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొని, పరిసరాలను పరిశుభ్రపరచడంతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా స్వర్ణాంధ్ర 2047లోని స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను చేరుకోగలుగుతామని జిల్లా ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి (డీఎ్ఫఎస్వో) ఎ.రవీంద్రరావు అన్నారు.
అధికారులు, సిబ్బంది విధిగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనాలి: డీఎ్ఫఎస్వో ఎ.రవీంద్రరావు
కలెక్టరేట్, మే 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధిగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొని, పరిసరాలను పరిశుభ్రపరచడంతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా స్వర్ణాంధ్ర 2047లోని స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను చేరుకోగలుగుతామని జిల్లా ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి (డీఎ్ఫఎస్వో) ఎ.రవీంద్రరావు అన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలోని జిల్లా సమాచార, పౌర సంబంధాల కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో డీపీఆర్వో ఎస్వీ మోహనరావు, ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి ఎ.రవీంద్రరావు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ జె.సుమ న్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల డీసీవో ఎ.మురళీకృష్ణ ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. బీట్ ది హీట్ ఇతివృత్తంతో ఈనెల స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని జరుపుతుండడంతో సహచార అధికారులతో కలిసి కార్యాలయ సందర్శకులకు చల్లని తాగునీరు, మజ్జిగను రవీంద్రరావు పంపిణీ చేశారు.