ల్యాండ్ పూలింగ్తో రైతులకే మేలు
ABN , Publish Date - May 10 , 2025 | 12:50 AM
ల్యాండ్ పూలింగ్ వల్ల భూములిచ్చే రైతులకు ప్రభుత్వం మేలు చేస్తుం దే తప్ప నష్టపరచదని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య అన్నారు.

త్వరలో పూర్తి విధివిధానాలు వెల్లడిస్తాం: ఆర్డీవో చైతన్య
కేతనకొండ, కాచవరం గ్రామాల్లో గ్రామసభలు
స్పష్టమైన హామీ ఇచ్చే వరకు భూములిచ్చేది లేదు: రైతులు
ఇబ్రహీంపట్నం, మే 9(ఆంధ్రజ్యోతి): ల్యాండ్ పూలింగ్ వల్ల భూములిచ్చే రైతులకు ప్రభుత్వం మేలు చేస్తుం దే తప్ప నష్టపరచదని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య అన్నారు. మండలంలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూసేకరణ చేయాలనుకుంటున్న కేతనకొండ, కాచవరం గ్రామాల్లో శుక్రవారం రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభల్లో ఆర్డీవో మాట్లాడారు. రైతులు తెలిపిన అభ్యంతరాలన్నీ న్యాయమైనవే అన్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు ఏడాదికి ప్రభుత్వం ఎకరానికి రూ.30 వేలు కౌలు చెల్లించిందని, ప్రతి ఏడాది 10 శాతం పెంచుతుంద ని తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీకి భూములిచ్చే రైతుల కు ప్రభుత్వం కౌలు చెల్లింస్తుందన్నారు. ఎకరా భూమి ఇచ్చిన రైతుకు 4,840 గజాల భూమిని ప్రభుత్వం అభివృద్ధి చేసి ఇస్తుందన్నారు. ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సీటీ రావడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని వివరించారు. స్పోర్ట్స్ సిటీలో నిర్మాణాలు జరిగే వరకు రైతులు వారి భూముల్లో పంటలు పం డించుకోవచ్చన్నారు. పూర్తి విధి విధానాలు త్వరలోనే స్పష్టం చేస్తామన్నారు. భూములిచ్చే రైతులకు ఏం చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వకుం డా భూములు ఇచ్చేది లేదని కొందరు రైతులు అభ్యంతరం తెలిపారు. తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.