Share News

శ్రీవారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో సౌభాగ్యం

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:58 PM

తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో టీటీడీ కల్యాణమండపంలో శ్రీవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పురస్క రించుకుని సౌభాగ్యం కార్యక్రమం నిర్వహిం చారు.

 శ్రీవారి  ఆలయంలో   భక్తిశ్రద్ధలతో సౌభాగ్యం
స్వామి వద్ద పూజలు చేసేందుకు తీసుకువెళుతున్న కంకణాలు

లబ్బీపేట, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో టీటీడీ కల్యాణమండపంలో శ్రీవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పురస్క రించుకుని సౌభాగ్యం కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో టీటీడీ ఆధీనంలో ఉన్న 60 దేవాలయాల్లో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి వచ్చిన మహిళలకు సౌభాగ్య ప్రతిరూపాలైన కుంకుమ, పసుపుతాడు, అమ్మవారి పుస్తకం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయాల పర్యవేక్షణ అధికారి మల్లికార్జునరావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ లలితా రమాదేవి పర్యవేక్షించారు.

Updated Date - Aug 08 , 2025 | 11:58 PM