సీపీఎం జనచైతన్య యాత్ర ప్రారంభం
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:33 AM
14వ డివిజన్లోని సమస్యలపై బుధవారం సీపీఎం జనచైతన్య యాత్రను ప్రారంభిం చింది. కాల్వకట్ట పుట్ట రోడ్డులో సీపీఎం దళం పర్యటించింది.

సీపీఎం జనచైతన్య యాత్ర ప్రారంభం
పటమట, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): 14వ డివిజన్లోని సమస్యలపై బుధవారం సీపీఎం జనచైతన్య యాత్రను ప్రారంభిం చింది. కాల్వకట్ట పుట్ట రోడ్డులో సీపీఎం దళం పర్యటించింది. సీపీఎం తూర్పునగర్ కార్యదర్శి పుప్పాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ పాదయాత్ర ప్రారం భించినట్లు చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి 90 రోజులైనా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన చెందారు. విద్యుత్ బిల్లులు గత ప్రభుత్వం కంటే ఎక్కువుగా వస్తున్నాయన్నారు. లంబాడీపేట ప్రాంతాల్లో కోతులను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్యదర్శి రవీంద్ర, నగర నాయకులు గురుమూర్తి, డి.వరప్రసాద్, కన్న బాబ్జి, ఏడుకొండలు పాల్గొన్నారు.