Share News

వేదాద్రి బ్రహ్మోత్సవాలకు రండి

ABN , Publish Date - May 06 , 2025 | 12:47 AM

బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని సోమవారం ఆలయ ఈవో సురే్‌షబాబు ఆహ్వానపత్రిక అందించి ఆహ్వానించారు.

వేదాద్రి బ్రహ్మోత్సవాలకు రండి
మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేస్తున్న ఈవో సురేష్‌బాబు

జగ్గయ్యపేట రూరల్‌, మే 5(ఆంధ్రజ్యోతి): వేదాద్రిలో ఈనెల ఏడు నుంచి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని సోమవారం విజయవాడలో ఆలయ ఈవో సురే్‌షబాబు ఆహ్వానపత్రిక అందించి ఆహ్వానించారు. 11న భూనీలా సమేత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి తిరుక్కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామని, కల్యాణానికి రావాలని ఆయన కోరారు. కేసీపీ ప్రతినిధి రాంప్రసాద్‌ ఆయన వెంట ఉన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:47 AM