భవానీ ముక్తేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.3.41 లక్షలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:04 AM
భవానీముక్తేశ్వరస్వామి ఆలయానికి రూ.3,41,205 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో సురే్షబాబు తెలిపారు.

జగ్గయ్యపేట రూరల్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి సందర్భంగా భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా ముక్త్యాలలోని భవానీముక్తేశ్వరస్వామి ఆలయానికి రూ.3,41,205 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో సురే్షబాబు తెలిపారు. ఆలయ ఆవరణలో సోమవారం హుండీలను తెరిచి కానుకలను లెక్కించారు. దేవదాయ శాఖ తనిఖీదారు పవన్కల్యాణ్, వంశపారంపర్య ధర్మకర్త తరపున రామ్ప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.