Greeshma Oath: ఎమ్మెల్సీగా కావలి గ్రీష్మ ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - May 10 , 2025 | 04:58 AM
రాష్ట్ర శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికైన కావలి గ్రీష్మ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ఆమెకు ప్రమాణ స్వీకారం చేయించారు

అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): ఇటీవల రాష్ట్ర శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికైన కావలి గ్రీష్మ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ భవనంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు శుక్రవారం తన చాంబర్లో ఆమెతో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శాసనమండలి నియమ నిబంధనలకు సంబంధించిన కిట్ను గ్రీష్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, గ్రీష్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.