గ్రామ సచివాలయం ప్రారంభం
ABN , Publish Date - Mar 13 , 2025 | 10:49 PM
చిన్నంపల్లె గ్రామ పంచాయతీల్లో నూతనంగా నిర్మించిన గ్రా మ సచివాలయాన్ని రైల్వేకోడూరు టీడీపీ ఇనచార్జి, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి ప్రారం భించారు.

ఓబులవారిపల్లె, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : చిన్నంపల్లె గ్రామ పంచాయతీల్లో నూతనంగా నిర్మించిన గ్రా మ సచివాలయాన్ని రైల్వేకోడూరు టీడీపీ ఇనచార్జి, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి ప్రారం భించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్రీధర్రావు, ఎంపీడీవో మల్రెడ్డి, మాజీ ఎంపీపీ, టీడీపీ సీ నియర్ నాయకులు జి.వెంకటేశ్వర్రాజు,మండల సీనియర్ నాయకులు పున్నాటి వాసుదేవరెడ్డి, మాజీ ఎంపీపీ తమ్మెద తిరుపాలు, జడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనరసయ్య, పంచాయతీరాజ్ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.