పేదల ఆకలి తీర్చడంలో ఎంతో సంతృప్తి ఉంది
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:14 PM
పేదల ఆకలి తీర్చడంలో ఎం తో సంతృప్తి ఉందని, కోడూరు పట్టణంలో అన్న క్యాంటీన ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని రైల్వేకోడూరు ఇనచార్జ్, కుడా చైర్మన ముక్కా రుపానందరెడ్డి అన్నారు.

కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి
రైల్వేకోడూరు రూరల్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పేదల ఆకలి తీర్చడంలో ఎం తో సంతృప్తి ఉందని, కోడూరు పట్టణంలో అన్న క్యాంటీన ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని రైల్వేకోడూరు ఇనచార్జ్, కుడా చైర్మన ముక్కా రుపానందరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని చిట్వేలి రోడ్డు ప్రభుత్వ ఆ స్పత్రి వద్ద నిర్మించే అన్న క్యాంటీన స్థలంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదలకు కడుపు నింపడానికి క్యాంటీన నిర్వహించాలని కోరిక ఉండేదని, ఈ విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆ కోరిక తీరందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఎస్ చైర్మన జయప్రకాష్, రాష్ట్ర యువజన నాయకుడు ముక్కా వికాష్ రెడ్డి, మైనారిటీ నాయకులు పఠాన మౌలా (అల్లాబకాష్), టీడీపీ నాయకులు బత్తిన వేణుగోపాల్, పోతురాజు నవీన, నార్జాల హేమరాజ్, జనసేన నాయకుల తాతంశెట్టి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.