వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం: చమర్తి
ABN , Publish Date - May 09 , 2025 | 11:29 PM
గత వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిద్దవటం, మే 9 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని భాకరాపేట గ్రామంలో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము కింద రూ.5 లక్షల నిఽధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను జగనమోహనరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యమన్నారు. సిద్దవటం ప్రధాన రహదారి రోడ్లు విస్తరణ పనులు త్వరలో చేపడతామన్నారు. ఖాదర్బంగ్లా, జ్యోతి పెన్నానదిపై వంతెన నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. బీసీసెల్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులునాయుడు,టీడీపీ అధ్యక్షుడు మోహనరెడ్డి, క్లస్టర్ ఇనచార్జి దశరథ నాయుడు, గ్రామ సర్పంచ ప్రతినిధి, టీడీపీ యవనేత ప్రతా్పనాయుడు, ఉపసర్పంచ ప్రతినిధి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.