సీహెచవోల సమస్యలు పరిష్కరించాలి : సీపీఎం
ABN , Publish Date - May 08 , 2025 | 11:32 PM
సీహెచవోల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

రాయచోటి(కలెక్టరేట్), మే8(ఆంధ్రజ్యోతి): సీహెచవోల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం నేషనల్ హెల్త్ మిషనలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న సీహెచవో (ఎంఎల్హెచపీ)లు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు. అదేవిధంగా ఏపీ ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్), భారత విద్యార్థి ఫెడరేషన (ఎస్ఎ్ఫఐ), ఆంధ్రప్రదేశ వ్యవసాయక కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యుయూ)నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి జాబీర్, ఎస్ఎ్ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న, జిల్లా అధ్యక్షుడు నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుఽధాకర్ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట సీహెచవోలు చేపట్టిన నివధిక దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎనహెచఎంలోని క్యాడర్లకు ఎంటీఎస్ అమలు చేయకుండా వివక్ష చూపుతోందన్నారు. 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులతో సమానంగా ఎనహెచఎంలోని అన్ని క్యాండర్లకు ఎంటీఎస్ అ మలు చేసేందన్నారు. హెచఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు
సీహెచవో(ఎంఎల్హెచపీ)ల సమ్మెకు ఏఐటీయూసీ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలి పింది. ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ ఎంఎల్హెచపీల వేతన పెం పు, హెచఆర్పాలనీ,ఇన్సెంటివ్ బకాయిల చెల్లింపు తదితర సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేశకుమార్, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యుడు తోపు కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.