Share News

మురుగునీటితో కలుషితమవుతున్న ఉత్తర కాలువ

ABN , Publish Date - May 02 , 2025 | 11:43 PM

మైలవరం జలాశయం రైతుల పంట పొలాలకు విడుదల చేసిన ఉత్తర కాలువ నీటిలో మురుగునీరు వచ్చి చేరుతోంది.

మురుగునీటితో కలుషితమవుతున్న  ఉత్తర కాలువ
కలుషితమవుతున్న ఉత్తర కాలువ

జమ్మలమడుగు, మే 2 (ఆంధ్రజ్యోతి): మైలవరం జలాశయం రైతుల పంట పొలాలకు విడుదల చేసిన ఉత్తర కాలువ నీటిలో మురుగునీరు వచ్చి చేరుతోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగు మండల పరిదిలోని 4వ వార్డు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన కాలువ నిర్మించక పోవడంతో పట్టణంలోని నీరు పక్కనే మురుగునీటి కాలువలో చేరి అక్కడి నుంచి ఉత్తర కాలువలో కలుస్తున్నాయి. ఆ నీటిలో డ్రైనేజీ నీరు కలుస్తుండడం వలన నీరంతా కంపుకొడుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - May 02 , 2025 | 11:43 PM