Share News

ప్రపంచంలో అత్యంత విలువైనది సమానత్వమే

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:00 AM

ప్రపంచంలో అత్యంత వి లువైనది సమానత్వమేనని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి వరలక్ష్మి పేర్కొన్నారు.

ప్రపంచంలో అత్యంత విలువైనది సమానత్వమే
సభలో మాట్లాడుతున్న విప్లవ రచయిత్రి పి వరలక్ష్మి

ప్రొద్దుటూరు, మార్చి 10 (ఆంధ్ర జ్యోతి) :ప్రపంచంలో అత్యంత వి లువైనది సమానత్వమేనని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి వరలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్ధానిక హనుమానన గర్‌లో చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో చదువల తల్లి సావిత్రి బాయి పూలే వర్ధంతి సందర్బంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సునుద్దేశించి వరలక్ష్మీ మాట్లాడుతూ స్ర్తీలకు పురుషులతో పాటు సమాన హక్కులు సాధించడంలో సావిత్రిబాయి పూలే పోరాటం ఘననీయమైనదన్నారు. చైతన్య మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ పద్మ మాట్లాడుతూ మహిళలు సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రముఖ వైద్యులు వరుణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడు తూ స్ర్తీలు అన్ని రంగాలను శాసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మెప్మా సీవోలు విమల, శ్రీదేవి రసూలమ్మ, ఆర్పీల సంఘం అధ్యక్షు రాలు తనికంటి లక్ష్మీదేవి, అంగనవాడీ వర్కర్స్‌ యూనియన చంద్రావతి పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:00 AM