ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి
ABN , Publish Date - May 03 , 2025 | 11:28 PM
ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు.
రామాపురం, మే3(ఆంధ్రజ్యోతి): ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామాపురం మండలం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నోచుకోక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ప్రజా క్షేమమే ధ్యే యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.