Share News

రైల్వేకోడూరును అభివృద్ధి చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Jun 11 , 2025 | 11:15 PM

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని టీడీపీ రైల్వేకోడూరు ఇనచార్జ్‌, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.

రైల్వేకోడూరును అభివృద్ధి చేయడమే లక్ష్యం
శెట్టిగుంటలో సిమెంట్‌ రోడ్డుకు భూమి పూజ చేస్తున్న ముక్కా

రైల్వేకోడూరు, జూన 11(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని టీడీపీ రైల్వేకోడూరు ఇనచార్జ్‌, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. బుధవారం రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట గ్రామ పంచాయతీ కేంద్రంలో రూ.50 లక్షలతో సిమెంట్‌ రోడ్డుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేకోడూరు నియోజకవర్గంలో అభివృద్ధి లేక వెనుకబడి ఉన్న సమయంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి రావడంతో ఐదు మండలాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతన్నాయన్నారు. రాబోవు నాలుగేళ్లలో రైల్వేకోడూరును రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపు తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా డీసీఎంస్‌ చైర్మన ఎర్రగుండ్ల జయప్రకాష్‌, కూటమి నాయకులు బత్తిన వేణుగోపాల్‌రెడ్డి, నాగినేని వెంకటరమణ, చంద్రశేఖర్‌, కొమ్మా శివ, ఉప సర్పంచ కంచిరాజు రామరాజు, శేఖర్‌. గడికోట సుబ్బరాయుడు, పీఆర్‌ డీఈ బాలనరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 11:15 PM