TDP Celebrations: పులివెందుల గెలుపు.. రాష్ట్రమంతా సంబరాలు
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:18 PM
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. జగన్ కంచుకోట గోడలను బద్దలు కొట్టమనే సంబరాల్లో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పులివెందులతో పాటు రాష్ట్ర మంతటా ఈ టీడీపీ నేతల సంబరాలతో పల్లెల నుంచి పట్నం వరకు అంత పసుపు మాయం అయింది.
కడప, ఆగస్టు 14: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. జగన్ కంచుకోట గోడలను బద్దలు కొట్టమనే సంబరాల్లో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పులివెందులతో పాటు రాష్ట్ర మంతటా ఈ టీడీపీ నేతల సంబరాలతో పల్లెల నుంచి పట్నం వరకు అంత పసుపు మాయం అయింది. కడప గడప ఇప్పుడు పసుపుతో శుద్ధి చేయబడింది. ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీ శ్రేణులను నిరాశ పరిచిన.. పులివెందుల ప్రజలకు అభివృద్ధికి బాట చూపింది.
ఈ విజయం ముమ్మాటికీ అభివృద్ధి కోరికునే ప్రజలదని .. అభివృద్ధికి అడుగులు నేర్పుతున్న టీడీపీ దే అని పసుపు తమ్ములు టపాసులకు కలుస్తూ తమ విజయాన్ని జరుపుకుంటున్నారు. కాగా పులివెందులలో తొలిసారి టీడీపీ విజయం సాధించింది. 1995 నుంచి కూడా అక్కడ కాంగ్రెస్, వైసీపీలు గెలుస్తూ వచ్చాయి.. ఒక కుటుంబానికి అనుకూలంగా ఉన్న జిల్లాలో టీడీపీ భారీ మెజారిటీతో గెలవడం చరిత్రను తిరగరాయడమే అని చెబుతున్నారు టీడీపీ నేతలు.