బ్రహ్మోత్సవాలకు రోడ్లు పరిశీలన
ABN , Publish Date - May 06 , 2025 | 11:57 PM
డివిజన్ కేంద్రమైన జమమ్మలమడుగులో శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించు కుని రథోత్సవానికి సంబంధించి ప్రధా న రహదారులను అధికారులు పరిశీలిం చారు.

జమ్మలమడుగు, మే 6 (ఆంధ్రజ్యోతి): డివిజన్ కేంద్రమైన జమమ్మలమడుగులో శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించు కుని రథోత్సవానికి సంబంధించి ప్రధా న రహదారులను అధికారులు పరిశీలిం చారు. ఈనెల 10వ తేదీ నుంచి శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవా లు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఈనెల 17వ తేదీ వైభవంగా రథోత్సవం జరుగనున్నందున కమిషనర్ వెంకటరామిరెడ్డి, కూటమి నాయకుడు గోనా పురుషోత్తంరెడ్డి, ఆలయ అధికారులు, పండితులు, స్థానికులు ప్రధాన రోడ్లను పరిశీలించారు. శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి తేరు రోడ్డు, పెద్దపసుపుల మోటు, సంజాముల మోటు, పాత బస్టాండు, కూరగాయల మార్కెట్వీధి, మెయిన్బజార్, అంబాభవానీ దేవాలయం వీధి, పలగాడి సెంటర్ తదితర చోట్ల రోడ్లు పరిశీలించారు. రథోత్సవానికి ఇబ్బంది కలిగించకుండా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.