ఆపరేషన సిందూర్కు మద్దతుగా ర్యాలీ
ABN , Publish Date - May 08 , 2025 | 11:31 PM
భారత సైన్యం సౌర్యాన్ని స్మరించుకుంటూ దేశభక్తిని చాటుతూ అన్నమాచార్య విశ్వవిద్యాలయం గురువారం ఆపరేషన సిందూర్కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.

రాజంపేట, మే 8 (ఆంధ్రజ్యోతి): భారత సైన్యం సౌర్యాన్ని స్మరించుకుంటూ దేశభక్తిని చాటుతూ అన్నమాచార్య విశ్వవిద్యాలయం గురువారం ఆపరేషన సిందూర్కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, విభాగాధిపతులు, అనుబంధ విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ ఇ.సాయిబాబారెడ్డి, రిజిసా్ట్రర్ ఎన.మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ ఎస్ఎంవీ నారాయణ మాట్లాడుతూ భారత సైనికుల ధైర్యం, భారతదేశ బలాన్ని ప్రపంచానికి చాటుతుందని ప్రశంసించారు. భారతదేశం ఎల్లప్పుడు ఉ గ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమై నిలుస్తుందని, తన సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఒకే స్వరంతో ఉండాలని, శాంతి పరిరక్షణకు అంతర్జాతీయ మద్దతు అవసరమని తెలిపారు. సైనిక బలగాలకు ప్రతిఒక్కరూ మద్దతు తెలపాలన్నారు.
భారత సైన్యానికి జేజేలు: సీపీఐ
నందలూరు, మే 8 (ఆంధ్రజ్యోతి) : ‘పాకిస్థాన ఉగ్రవాదుల స్థావరాలపై దాడిచేసి ధ్వంసం చేసిన భారత సైన్యానికి జేజేలు’ అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. గురువారం సీపీఐ అన్నమయ్య జిల్లా సమితి సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యుడు మండెం సుధీర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన సిందూర్ను చేపట్టి భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి ధ్వంసం చేయడం మన సౌర్యానికి అద్దంపట్టే చర్య అన్నారు. ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతిఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు, రాష్ట్ర సమితి సభ్యులు ఎన.వెంకటశివ, అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్, కార్యవర్గ సభ్యులు సిద్దిగల శ్రీనివాసులు సుధీర్, మురళీ, చిన్నయ్య, రైతుసంఘం జిల్లా కార్యదర్శి వంగిమల రంగారెడ్డి పాల్గొన్నారు.