Share News

సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 30 , 2025 | 11:51 PM

రానున్న వర్షాకాలం నేపథ్యం లో సీజనల్‌ వ్యాదుల పట్ల ప్రతి ఒక్క రూ అప్రమత్తంగా ఉండాలని కామ నూరు పీహెచసీ వైద్యాధికారి డాక్టర్‌. హనీఫ్‌బాబా పేర్కొన్నారు.

 సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈశ్వరరెడ్డి నగర్‌లో ర్యాలీ చేస్తున్న వైద్య బృందం

ప్రొద్దుటూరు రూరల్‌, మే 30 (ఆంధ్ర జ్యోతి): రానున్న వర్షాకాలం నేపథ్యం లో సీజనల్‌ వ్యాదుల పట్ల ప్రతి ఒక్క రూ అప్రమత్తంగా ఉండాలని కామ నూరు పీహెచసీ వైద్యాధికారి డాక్టర్‌. హనీఫ్‌బాబా పేర్కొన్నారు. శుక్రవారం ఫ్రైడే-డ్రైడే సందర్బంగా సోములవారి పల్లి పంచాయతీ పరిదిలోని పెన్నాన గర్‌, ఈశ్వరరెడ్డి నగర్‌లో దోమకాటు- ఆరోగ్యానికి చేటు అనే నినానదంతో ర్యాలీ, అవగాహన సదస్సును నిర్వహించారు. మలే రియా సబ్‌ యూనిట్‌ అధికారి శ్రీనివాస్‌ మాట్లాడుతూ దోమల వలన వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ చర్యలు, పరిసరాల శుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్ర మంలో సూపర్‌వైజర్‌ వరప్రసాద్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ చంద్ర శేఖర్‌, ఏఎనఎంలు ఉమారాణి, వీరమ్మ, ఆశా కార్యకర్తలు వరలక్ష్మి, శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:51 PM