పంచాయతీని శుభ్రపరిచిన అధికారులు
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:09 AM
మండల పరిధిలోని పత్తూరు పంచాయతీలో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాలను శుక్రవారం అధికారులు పరి శుభ్రం చేయించారు.
ఖాజీపేట, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పత్తూరు పంచాయతీలో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాలను శుక్రవారం అధికారులు పరి శుభ్రం చేయించారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఇదేనా స్వచ్ఛభారత్’ కథనం రావడంతో ఎంపీడీవో వెంకటరమణ ఆదేశాల మేరకు పత్తూరు సెక్రటరి ఎ.శంకరమ్మ డోజర్ సహాయంతో పంచాయతీలోని చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలోని ప్రజలు, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదని చెత్త సేకరణకు ప్రతి రోజు సిబ్బంది వస్తున్నారని వారికి అందించాలని అలా చేయకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ పరిధిలో తొట్లను ఏర్పాటు చేస్తామని అక్కడ మాత్రమే చెత్తను వేయాలన్నారు.