Share News

ఆపరేషన సిందూర్‌కు నందమూరి యువసేన మద్దతు

ABN , Publish Date - May 08 , 2025 | 11:34 PM

పహల్గాంలో 27మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను తుద ముట్టించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన సిందూర్‌కు సంఘీ భావం తెలుపుతున్నట్లు నందమూరి యువసేన సమితి అధ్యక్షుడు గోమేదికం సుదర్శన పేర్కొన్నారు.

ఆపరేషన సిందూర్‌కు నందమూరి యువసేన మద్దతు
జాతీయ పతాకాలు ప్లకార్డులతో సంఘీభావం తెలుపుతున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన, మే8 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో 27మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను తుద ముట్టించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన సిందూర్‌కు సంఘీ భావం తెలుపుతున్నట్లు నందమూరి యువసేన సమితి అధ్యక్షుడు గోమేదికం సుదర్శన పేర్కొన్నారు. గురువారం పొట్టి పాడు రోడ్డులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద జాతీయ పతకాలు ప్లకార్డులతో సంఘీ భావం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదుల స్ధావరాలను మట్టుపెట్టిన భారత సైన్యానికి దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకట సుబ్బయ్య, మహబుబ్‌బాషా, రామునాయుడు, గుర్రప్ప యాదవ్‌ పాల్గొన్నారు.

కొండాపురంలో: ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో భారతసైన్యం చేపట్టిన ఆపరేషన సిందూర్‌ కార్యక్రమం దేశానికి గర్వకార ణమని తాళ్లప్రొద్దుటూరు మాజీ సర్పంచ రామసుబ్బారెడ్డి తెలిపారు. గురువారం మం డలంలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉగ్రవాద చర్యల పై భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపం చంలోని మెజారిటీ దేశాలు సమర్థిసు ్తన్నాయని తెలిపారు. ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టి, పోరాటం చేసిన సైనికులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

నేడు విజయోత్సవ ర్యాలీ

ప్రొద్దుటూరు టౌన మే 8(ఆంధ్రజ్యోతి): ఆపరేషన సిందూరం ద్వారా ఉగ్రవాదులను అంతమొందిం చిన సైనికులను అభినందిస్తూ 9న విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తు న్నట్లు వీహెచపీ జిల్లా అధ్యక్షు డు నాగార్జున రావు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు ర్యాలీ కొనసా గుతుందని వివిధ సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - May 08 , 2025 | 11:34 PM