నిరుపేదలకు భూ పంపిణీ చేయాలి
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:57 PM
నిరుపేదలకు భూ పంపిణీ చేయాలని కార్మిక సంఘం నాయకులు, గ్రామస్థులు తెలిపారు.
ఓబులవారిపల్లె, జూన 30 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు భూ పంపిణీ చేయాలని కార్మిక సంఘం నాయకులు, గ్రామస్థులు తెలిపారు. సోమవారం వారు తహసీల్దార్ యామినికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల పరిధిలోని కొర్లకుంట పంచాయతీలో సర్వేనంబరు 249/1లో ఉన్న 172 ఎకరాల భూమిని కొర్లకుంట దళితులకు కేటాయించాలన్నారు. భూ పంపిణీ చేయకుంటే పోరాటాలకు సిద్ధమవుతామని డిమాండ్ చేశారు. సీపీఐ ఓబులవారిపల్లె మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ, డీహెచపీఎ్స నియోజకవర్గ కార్యదర్శి మోడి శివయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.