80 శాతం రాయితీతో కిసాన డ్రోన్లు
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:47 PM
మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ అధ్యక్షతన చిన్నర్సుపల్లె గ్రామం రైతు రవీంద్ర శ్రీరామ గ్రూప్కు 80 శాతం రాయితీతో క్రిసాన డ్రోన్లను అందించారు.
చిన్నమండెం, జూలై29(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ అధ్యక్షతన చిన్నర్సుపల్లె గ్రామం రైతు రవీంద్ర శ్రీరామ గ్రూప్కు 80 శాతం రాయితీతో క్రిసాన డ్రోన్లను అందించారు. డ్రోన వినియోగంతో సమయం ఆదా అవుతుందన్నారు. ఇది ప్రభు త్వం రైతులకు ఇచ్చే గొప్పవరమని దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. తొక్కట లేకుండా పిచికారీ చేసుకోవచ్చునని, మందులు సైతం తక్కువ మోతాదులో పడతాయని వారు వివరించారు. ఏడీఏ శ్రీలత, యూనియన బ్యాంక్ మేనేజర్ పెద్దరెడ్డెయ్య, ఏవో గీత, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.