Share News

ఆసుపత్రి ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు ఇవ్వాలి

ABN , Publish Date - May 06 , 2025 | 11:56 PM

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌ సో ర్సింగ్‌ పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు ఈ నెల 10 లోపు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యద ర్శి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.

ఆసుపత్రి ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు ఇవ్వాలి
ఆసుపత్రి సూపరిండెంట్‌ కు వినతి పత్రం ఇస్తున్న కార్మికులు

ప్రొద్దుటూరు , మే 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌ సో ర్సింగ్‌ పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు ఈ నెల 10 లోపు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యద ర్శి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం జిల్లా ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ శ్రీవాణికి కార్మికులు వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా సత్య నారాయణ మాట్లాడుతూ కార్మికుల జీతాల నుంచి కట్‌ చేస్తున్న ఈపీఎఫ్‌ డబ్బులు కూడా వారి ఖాతాలో జమకావడంలేదన్నారు. ఆసుపత్రి కార్మికులు అర్ధాలికలితో బతకా ల్సివస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు చెల్లించాలని లేకుంటే విధులు బహిష్కరించి ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి విజయ్‌ కుమార్‌, ఆసుపత్రి యూనియన గౌరవ అధ్యక్షుడు రాఘవ, అధ్యక్ష, కార్యదర్శులు రత్నమ్మ, కళావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:56 PM