Share News

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:06 AM

ీసీఎం సహాయనిధి పేదలకు ఒక వరంలాం టిదని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజక వర్గ ఇనచార్జి రితేష్‌రెడ్డి లు పేర్కొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కు అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువనేత రితీష్‌రెడ్డి

బద్వేలు టౌన/ పోరుమా మిళ్ల, మే 31 (ఆంధ్రజ్యో తి): ీసీఎం సహాయనిధి పేదలకు ఒక వరంలాం టిదని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజక వర్గ ఇనచార్జి రితేష్‌రెడ్డి లు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధికింద 10 మంది లబ్ధిదారులకు రూ.4,95,253 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. పోరుమామిళ్లకు చెంది న సుంకేసుల సుభద్రకు రూ.45వేల సీఎం రిలీఫ్‌ఫండ్‌ను వారు అందించారు. రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ, . కల్వకూరి రమేశ, చెరకూరి కేశవ, కల్వకూరి శివకుమార్‌ పాల్గొన్నారు.

కలసపాడులో: మండల పరిఽధిలోని చింతలపల్లె గ్రామానికి చెందిన గాలి రాములుకు రూ.50,250, ముదిరెడ్డిపల్లెకు చెందిన షేక్‌ చాంద్‌ బాషా కు రూ.40,787, బలిజపల్లెకు చెందిన తిరుమలమ్మకు రూ.23,400 చెక్కుల ను విజయమ్మ, రితీష్‌రెడ్డిలు అందించారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన రంతు, మాజీ జడడ్పీటీసీ భూపాల్‌రెడ్డి, మండల పార్టీ ఉపా ధ్యక్షులు పట్టాభిరెడ్డి, యువనా యకులు శ్రావణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

కాశినాయనలో:మండలంలోని బాలాయపల్లె గ్రామానికి చెందిన కల్లూరి నరసింహారెడ్డికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.36 వేల రూపాయల చెక్కును విజయమ్మ, రితేష్‌కుమార్‌రెడ్డిలు అందజే శారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు బసిరెడ్డి రవీంద్రారెడ్డి, డి.క్రిష్ణారెడ్డి, పి.జయరామిరెడ్డి, వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:06 AM