సీఐటీయూ జెండా ఆవిష్కరణ
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:00 AM
సీఐటీయూ 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూనియన నాయకులు శనివారం రాజంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట జెండా విష్కరణ చేశారు.
రాజంపేట, మే 31 (ఆంధ్రజ్యోతి) : సీఐటీయూ 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూనియన నాయకులు శనివారం రాజంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట జెండా విష్కరణ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతూ వా రి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన జిల్లా ప్రధాన కార్యదర్శి సీవీ రమణ, ప్రసాద్, లక్ష్మీదేవి, ఎంవీ రమణ, సాలమ్మ, సురేష్ పాల్గొన్నారు.