రక్తదానం పుణ్యకార్యం
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:02 AM
మెగా రక్తదాన వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి కడప జి ల్లా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శనివారం మండలంలోని అనంతరాజుపేట ఉద్యాన కళాశాల ఆవరణంలో జేబీవీఎస్, ఎనఎ్సఎ్స యూనిట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
రైల్వేకోడూరు, జూలై 26(ఆంధ్రజ్యోతి): మెగా రక్తదాన వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి కడప జి ల్లా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శనివారం మండలంలోని అనంతరాజుపేట ఉద్యాన కళాశాల ఆవరణంలో జేబీవీఎస్, ఎనఎ్సఎ్స యూనిట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన పీటీ శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తదానం పుణ్యకార్యం అన్నారు. ప్రభుత్వ వైద్యుడు సాయికుమార్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.