వరుస చోరీలతో బెంబేలు
ABN , Publish Date - May 09 , 2025 | 11:48 PM
మండలంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత సంవత్సరం నుంచి దొంగలు హల్చల్ చేస్తున్నారు.

ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగలు హడలిపోతున్న ప్రజలు పోలీసులు నిఘా పెంచాలంటున్న వైనం
బి.కోడూరు, మే 9 (ఆంధ్రజ్యోతి): మండలంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత సంవత్సరం నుంచి దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఇళ్లను, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని జనం వాపోతున్నారు. మండలంలో ఇప్పటికే చాలా గుళ్లు, ఇళ్లల్లో చోరీలు జరిగాయి. అందులో భాగంగానే గురువారం రాత్రి పాయలకుంట్ల గ్రామంలో ఓబులేసు అనే వ్యక్తి ఇంటిలో చోరీ జరిగింది. అలాగే నల్లగొండ నరసింహస్వామి, ఎర్రిఓబన్న బావి ఆంజ నేయస్వామి, పల్నాటి అంకాలమ్మ గుడిలో, అభయాంజనేయస్వామి గుడిలో, మున్నెల్లి శివాలయంలో బి.కోడూరు, పాయలకుంట్ల, రామచంద్రాపురం గ్రామాల్లో చోరీలు అధికంగా జరుగుతున్నాయి. దీంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని ఒక్క పాయలకుంట్ల గ్రామంలోనే బొమ్మన అంకయ్య ఇంటిలో, అలాగే సంగటిపల్లె కొండయ్య ఇంటిలో సరుడు అపహరించారు. అలాగే పాయలకుంట్ల గ్రామానికి చెందిన రాములవారి గుడిలో బంగారు వస్తువులు అపహరించారు. బికోడూరు నడిబొడ్డున ఓ ఇంటిలో మహిళ నిద్రిస్తుండగా మాంగల్య సరుడు అపహ రించారు. అయ్యవారిపల్లె గ్రామంలో వినాయకుడి గుడిలో ఇప్పటికే రెండు సార్లు హుండీ చోరీ జరిగింది. ఈ విషయమై అప్పట్లో స్థానికులు పోలీసుల కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలా రోజూ చోరీలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.
పట్టపగలే నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి గుడిలో చోరీ
ఇటీవల కాలంలో బద్వేలు-పోరుమామిళ్ల మెయిన రోడ్డు ఎర్రిఓబన్న బావి సమీపాన తూర్పుకొండ దడిన వెలసిన పురాతన నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. అప్పట్లో దాదాపుగా 14లక్షల రూపా యల సొమ్ములు అపహరణ జరిగింది. బి.కోడూరు పోలీసుస్టేషనకు కూత వేటు దూరంలో ఉన్న సగిలేటిలో హుండీ పడవేసి బికోడూరు స్టేషనుకే దొంగలు సవాల్ విసిరి వెళ్లారు. అప్పట్లో ఆ దొంగతనం సంచలనం రేపింది. నల్లగొండ నరసింహస్వామి గుడిలో ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున దాదా పుగా 1500 మంది భక్తులు వస్తుంటారు. అలాగే ప్రతి శని, సోమ వారాలు భక్తులు వచ్చి హుండీలో విరివిగా స్వామివారికి కానుకలు వేస్తుంటారు. నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పట్టపగలే చోరీ జరిగి ఇన్ని రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు దొంగలను పట్టుకోలేదని ఆలయ ధర్మకర్త లక్ష్మిరెడ్డి తెలిపారు.
పల్నాటి అంకాలమ్మ తల్లి ఆలయంలో..
మండల పరిధిలోని రాజుపాలెం గ్రామ సమీపాన వెలసిన పురాతన పల్నా డు అంకాలమ్మ తల్లి గుడిలో చోరీ జరిగింది. నిత్యం ప్రజలు సంచరించే ప్రదే శం బదే ్వలు- పోరుమామిళ్ల మెయిన రోడ్డు నుంచి మున్నెల్లి-బికోడూరు వెళ్లే రహదారికి ఆనుకుని గుడి ఉంది గుడి చుట్టూ పొలాలు, రైతులు ఎప్పుడూ తిరుగుతుంటారు. ఆ గుడిలో వెల్డింగు మిషనతో వాకిళ్లు తొలగించి దాదాపు రూ.8లక్షలు విలువ చేసే ఆభరణాలు అపహరించారు. అప్పట్లో గ్రామస్థులం తా కలిసి ఫలానా వ్యక్తులు దొంగతనం చేశారని మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
నిఘా పెంచి చోరీలను అరికడతాం
మండలంలో జరుగుతున్న వరుస చోరీల విషయమై బి.కోడూరు ఎస్ఐ వెంకటసురేశను వివరణ కోరగా తాను కొత్తగా వచ్చానని, దొంగతనాలపై ఇక మీదట గట్టి నిఘా పెడుతామన్నారు. గుళ్లల్లో, ఇళ్లల్లో చోరీలు జరిగే వారిని పట్టుకుంటామని ఎట్టిపరిస్థితుల్లో వారిని వదలబోమని తెలిపారు.