రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
ABN , Publish Date - May 19 , 2025 | 11:27 PM
రోడ్డు ప్రమాదంలో రాయవరానికి చెందిన సర్పంచ్ షరీఫ్ తమ్ముడు షేక్.మహమ్మద్ (27) సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
సుండుపల్లె, మే 19(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో రాయవరానికి చెందిన సర్పంచ్ షరీఫ్ తమ్ముడు షేక్.మహమ్మద్ (27) సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసుల సమాచారం మేరకు... రాజంపేట నుంచి ద్విచక్రవాహనంలో షేక్.మహమ్మద్, మరో యువకుడు రాయవరానికి వస్తుండగా.. సుండుపల్లె వైపు నుంచి సానిపాయి వెళ్తున్న టెంపో వాహనం మడితాడు గ్రామ పంచాయతీ కృష్ణారెడ్డి చెరువు వద్ద ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతి చెందిన యువకుడు ఎంటెక్ చదువుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.