AP High Court: జస్టిస్ బట్టు దేవానంద్ మళ్లీ ఏపీ హైకోర్టుకు
ABN , Publish Date - May 28 , 2025 | 04:43 AM
జస్టిస్ బట్టు దేవానంద్ను మద్రాస్ హైకోర్టు నుంచి తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ బదిలీ అమల్లోకి రానుంది.
హైకోర్టు జడ్జీల బదిలీకి కొలీజియం సిఫారసు
అమరావతి, న్యూఢిల్లీ, మే 27(ఆంధ్రజ్యోతి): జస్టిస్ బట్టు దేవానంద్ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ నెల 26న సమావేశమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం జస్టిస్ దేవానంద్ను మద్రాస్ హైకోర్టు నుంచి మళ్లీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. జస్టిస్ బట్టు దేవానంద్ 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2023 మార్చిలో ఇక్కడి నుంచిమద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News