APEAPCET 2025: ఏపీఈఏపీసెట్కు 3,58,017 దరఖాస్తులు
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:48 AM
ఏపీ ఈఏపీ సెట్-2025కి మొత్తం 3,58,017 మంది దరఖాస్తు చేశారు. ఇందులో ఇంజనీరింగ్కు 2,77,507 మంది, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగానికి 79,610 మంది దరఖాస్తు చేశారు.
కాకినాడ(సర్పవరం జంక్షన్), ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జేఎన్టీయూకే ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంజనీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఈఏపీ సెట్)-2025 కోసం గడువు ముగిసేసరికి 3,58,017 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఏపీఈఏపీసెట్ చైర్మన్, జేఎన్టీయూకే ఉప కులపతి(వీసీ) ప్రొఫెసర్ సీఎ్సఆర్కే ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. వీటిలో ఇంజనీరింగ్ విభాగానికి 2,77,507 మంది, అగ్రికల్చర్-ఫార్మశీ విభాగంలో 79,610 మంది దరఖాస్తు చేశారన్నారు. ఈ రెండు విభాగాలకు 900 మంది దరఖాస్తు చేసినట్టు తెలిపారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..