Share News

Jail Officials: మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం అనుమతించలేం

ABN , Publish Date - Jul 26 , 2025 | 04:30 AM

మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి కోర్టు కల్పించిన సదుపాయాలపై జైలు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ

Jail Officials: మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం అనుమతించలేం

  • సహాయకుడిని ఏర్పాటు చేయలేం

  • ఏసీబీ కోర్టులో జైలు అధికారుల పిటిషన్‌

  • విచారణ 29కి వాయిదా

విజయవాడ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి కోర్టు కల్పించిన సదుపాయాలపై జైలు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించలేమని, సహాయకుడిని ఏర్పాటు చేయలేమని విజయవాడ ఏసీబీ కోర్టుకు తెలుపుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. సాధారణ ఖైదీలకు ఇస్తున్న ములాఖత్‌లకు మించి ఆయనకు ఇవ్వలేమని తెలిపారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. జైలు అధికారుల అభ్యంతరాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని మిథున్‌రెడ్డి తరఫు న్యాయవాదులకు కోర్టు నోటీసులు జారీచేసింది. విచారణను 29వ తేదీకి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 04:31 AM