Minister Savitha: జగన్ త్వరలో నీకూ గాలి గతే
ABN , Publish Date - May 08 , 2025 | 06:12 AM
జగన్కు త్వరలో గాలి జనార్ధనరెడ్డి గతం పడుతుందంటూ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలను మహిళల ఉచిత కుట్టు శిక్షణ పథకంపై చర్చకు పిలిచారు
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడని, రాష్ట్రంపై, కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి సవిత విమర్శించారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆమె మాట్లాడారు. జగన్కు త్వరలోనే గాలి జనార్దనరెడ్డి గతే పడుతుందన్నారు. మహిళలు ఉచిత కుట్టు శిక్షణ పథకంపై వైసీపీ నేతలు చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు.