ఆర్టీసీ భూముల కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ: రాంప్రసాద్రెడ్డి
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:19 AM
పీపీపీ పద్ధతిలో ఆర్టీసీ భూముల కేటాయింపులో అక్రమాలు ఉంటే ఆ భూములను వెనక్కి తీసుకుంటాం అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు.
బాపట్ల, జూలై 25(ఆంధ్రజ్యోతి): ‘పీపీపీ పద్ధతిలో ఆర్టీసీ భూముల కేటాయింపులో అక్రమాలు ఉంటే ఆ భూములను వెనక్కి తీసుకుంటాం’ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం బాపట్ల విచ్చేసిన ఆయ న ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మతో కలసి ఆర్టీసీ డిపోలో మాట్లాడారు. ‘వైసీపీ హయాంలో ఆర్టీసీ భూములు ఎవరెవరికి కట్టబెట్టారో తెలుసుకునేందుకు విచారణ చేపట్టాం. ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ విచారణ నివేదిక 15 రోజుల్లో వస్తుంది’ అని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News