వైద్య సేవల నాణ్యత పెంచాలి: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Jan 02 , 2025 | 03:01 AM
కొత్త సంవత్సరంలో ప్రభుత్వ, ప్రయివేటు వైద్య సేవల్లో నాణ్యత పెంచాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరంలో ప్రభుత్వ, ప్రయివేటు వైద్య సేవల్లో నాణ్యత పెంచాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రయివేటు రంగ వైద్యులు, సిబ్బందిని ఉద్దేశించి బుధవారం బహిరంగ లేఖ రాశారు. వైద్యసేవల్లో లోపాలను తొలగించాలన్నారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్కు అనుగుణంగా ఆరోగ్య, సంపన్న, ఆనంద ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు అంతా పునరంకితం కావాల ని ఆకాంక్షించారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఖర్చుతో కూడిన వైద్యం, రోగ నిర్థారణ కోసం అనవసరమైన పరీక్షలు చేయించడం, సిబ్బందికి తక్కువ వేతనాలు తదితర అంశాలు వాటి వ్యాపార దృక్పథానికి అద్దం పడుతున్నాయన్నారు.