YSRCP MLA: చెవిరెడ్డికి వైద్య పరీక్షలు
ABN , Publish Date - Jun 22 , 2025 | 03:35 AM
మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు.
విజయవాడ, జూన్ 21(ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో జైలు అధికారులు చెవిరెడ్డిని ప్రభుత్వాస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్కు తరలించారు. ఆయనకు ఎకో-టూడీ, ఈసీజీ, బీపీ, రక్తపరీక్షలు చేశారు. కాళ్లు తిమ్మిరిగా ఉంటున్నాయని చెప్పడంతో ఫిజియోథెరపీ వైద్యులు పరీక్షించారు. అనంతరం జైలుకు తీసుకెళ్లారు.
27న కేఆర్ఎంబీ ప్రత్యేక భేటీ
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): సిబ్బందికి చెల్లించిన ప్రోత్సాహకాన్ని రికవరీ చేయడంపై చర్చించేందుకు ఈనెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది.