Share News

విజయకేతనం!

ABN , Publish Date - Mar 13 , 2025 | 01:36 AM

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభను శుక్రవారం పిఠాపురంలో అంచనాలకు మించి విజయవంతం చేసేందుకు ఆ పార్టీ ఎక్కడిక క్కడ పక్కా ఏర్పాట్లు చేస్తోంది.

విజయకేతనం!

అందరి దృష్టి ఇక్కడే...

(కాకినాడ- ఆంధ్రజ్యోతి)

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభను శుక్రవారం పిఠాపురంలో అంచనాలకు మించి విజయవంతం చేసేందుకు ఆ పార్టీ ఎక్కడిక క్కడ పక్కా ఏర్పాట్లు చేస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలోని ఓ ప్రైవేటు లేఅవుట్‌లో రెండు లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు సిద్ధంచేస్తోంది. రాష్ట్రంతోపాటు తెలం గాణ, బెంగళూరు, చెన్నై తదితర రాష్ట్రాల నుంచి లక్షల మంది సభకు వస్తారని అంచనా. దీంతో స్వయంగా మంత్రి నాదెండ్ల కాకినాడ లోనే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభకు వచ్చే వీరికి ఎక్కడా ఏ ఇబ్బంది ఎదురు కాకుండా వేలాదిమంది పోలీసులు, అంబులె న్స్‌లు, భోజన వసతి కల్పిస్తున్నారు. అయితే తొ లుత అమరావతిలో మూడు రోజులు నిర్వహిం చాలని భావించిన ఆవిర్భావ సభను ఆ తర్వాత గోదావరి జిల్లాకు మార్చారు. జనసేనకు ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా రాజకీయంగా సెంటి మెంట్‌గా మారిన నేపథ్యంలో ఇక్కడి నుంచే తన విజయకేతన సభను నిర్వహించాలని నిర్ణ యించింది. దీంతో పవన్‌ సైతం సభావేదికకు విజయకేతన సభ అని స్వయంగా నామకరణం చేశారు. అలాగే సభకు మూడు ప్రవేశ ద్వారా లు ఏర్పాటుచేయగా, వాటికి పిఠాపురం రాజా శ్రీరాజా సూర్యారావు బహుదూర్‌, విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్‌, అపర అన్న పూర్ణ డొక్కా సీతమ్మల పేర్లు పెట్టడం ద్వారా ఉమ్మడి జిల్లాకు తగిన ప్రాధాన్యం కల్పించారు. రాజకీయంగా ఇన్నేళ్లల్లో ఎన్నో ఆటుపోట్లను చూసిన జనసేనకు 2024 ఎన్నికలు కనివినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టడం, తొలిసారి అధికారంలోకి రావడంతో సాకారమైన కలను అచ్చొచ్చిన గోదావరి జిల్లా నుంచే పంచుకోవా లనే ఉద్దేశంతో ఇక్కడే సభ నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో అందరి దృష్టి పిఠాపురంపైనే పడింది. తనకు రాజకీయంగా అండగా నిలబడుతోన్న గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచే 2024లో బరిలోకి దిగారు. అఖండ మెజార్టీతో విజయం సాధించి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యా రు. ఈ నేపథ్యంలో రాజకీయంగా తిరుగులేని విజయం సాధించిపెట్టడంతో గోదావరి జిల్లా పై మరింత ప్రేమతో ఇక్కడి నుంచే తన విజ య ప్రస్థానం పంచుకోవాలని పవన్‌ భావిస్తు న్నారు. అటు సభలో పిఠాపురంలో తనను గెలి పించిన ప్రజలకు పవన్‌ ధన్యవాదాలు తెలప నున్నారు. మరోపక్క సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం ఐదు గంటలపాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవన్‌కల్యాణ్‌ ప్రసంగంతో సభ ముగుస్తుంది.

పోరాటమే ఊపిరిగా..

జనసేన పార్టీ పుట్టిందే ప్రజాసమస్యలపై పోరుకోసం. పార్టీ ఆవిర్భావం నుంచి అధికా రంలోకి వచ్చిన వరకు ఇన్నేళ్లలో ఎన్నో సమ స్యలపై జనంకోసం జనసేన పోరాటాలు చేసిం ది. స్వయంగా పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అనేక సమస్యలపై పోరాటాలను తూర్పు గోదావరి జిల్లా నుంచే ప్రారంబించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు, అక్ర మాలపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కదిలి అప్పటి సర్కారు వెన్నులో వణుకు పుట్టించారు. దీంతో జనం తమ సమస్యల కోసం ఎన్నోసార్లు జనసేనవైపు చూశారు. ఉమ్మడి జిల్లాలో గత వైసీపీ పాలనలో అన్నదాతలు తీవ్రంగా నలిగి పోయారు. సాగునీటి నుంచి గిట్టుబాటు ధర వరకు సమస్యలే. దీంతో 2019 డిసెంబరులో కాకినాడ కేంద్రంగా రైతు సౌభాగ్య దీక్షతో ప్రభు త్వాన్ని కదిలించారు. రహదారుల గుంతలతో జనం పడుతున్న నరకయాతన నేపథ్యంలో ప్రభుత్వాన్ని కదిలించడం కోసం 2021 అక్టోబ రులో రాజమహేంద్రవరంలో పవన్‌ పర్యటిం చారు. స్వయంగా రహదారులపై గుంతలు పూ డ్చారు. 2022లో కౌలురైతు భరోసా యాత్ర పేరుతో మండపేటలో అన్నదాతల కుటుంబా లకు సొంతంగా చెక్‌లు పంపిణీ చేశారు. ఇలా ఒకటేంటి అనేక సమస్యలపై చలించి కదిలారు. ఇలా ప్రతి కష్టంలోను జనసేన ఉమ్మడి తూ ర్పుగోదావరి జిల్లాలో ప్రజా సమస్యలపై ఉద్య మమై కదిలింది. అనేకసార్లు పవన్‌ మాట్లాడు తూ జనసేనకు అధికారం ముఖ్యం కాదని జనం సమస్యలు పరిష్కారమే కీలకమని ప్రక టించారు. ప్రజల కోసం ప్రభుత్వాలపై ఎంత వరకు అయినా పోరాడుతుందని చేసి చూపిం చారు. దీంతో గడచిన అయిదేళ్లలో గోదావరి జిల్లా ప్రజల గుండెల్లో మరింతగా నాటుకుపో యింది. దీని ఫలితంగా పంచాయతీ, జడ్పీ, మున్సిపల్‌ ఎన్నికల్లో చిన్నచిన్న విజయాలతో జిల్లాలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిం చింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకు టీడీపీతో పొత్తు కుదరడంతో ఆ కల యిక గోదావరి జిల్లాలో ఓట్ల సునామీ సృష్టిం చింది. దీంతో అరాచక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. అయితే అధికారం అండతో గత వైసీపీ ప్రభుత్వం గోదా వరి జిల్లాను ధ్వంసం చేసి అరాచకంగా మా ర్చేసిందని ఎన్నికలప్పుడు పవన్‌ ధ్వజమెత్తారు. అందుకే గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూసుకునే బాఽధ్యత తనది అని హెచ్చరించారు. పవన్‌ చేసిన శపథానికి గోదావరి ప్రజలు అండగా నిలబడి నిజం చేశా రు. ఉమ్మడి జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటూ వైసీపీకి రాకుండా గుండా సున్నా మిగిల్చారు.

Updated Date - Mar 13 , 2025 | 01:36 AM