Share News

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.5.02 లక్షలు

ABN , Publish Date - May 31 , 2025 | 12:39 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది.

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.5.02 లక్షలు

ఆత్రేయపురం, మే 30(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తజనం అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.5,02,763 వచ్చి నట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారి మొక్కులు చెల్లించారు.

Updated Date - May 31 , 2025 | 12:39 AM