వాడపల్లి వెంకన్నఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - May 30 , 2025 | 12:23 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది.
ఆత్రేయపురం, మే 29(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తజనం అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.3,77,057 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి కాకినాడ రూరల్ చీడిగ గ్రామానికి చెందిన ఉలిశెట్టి భానునాగ వెంకట సత్యనారాయణ, కనకదుర్గ వరలక్ష్మి దంపతులు రూ.51వేలు విరాళం ఇచ్చారు. దాతలకు ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం అందచేశారు.