వెంకన్న ఒక్కరోజు ఆదాయం రూ.3.19లక్షలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:45 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది.
ఆత్రేయపురం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తజనం అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.3,19,840 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావుతెలిపారు. భక్తుల దాహర్తి నింపేందుకు మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.