వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.2.02 లక్షలు
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:10 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది.

ఆత్రేయపురం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనం తరం భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.2,02,913 వచ్చినట్టు ఉప కమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.