రూపాయలు పంపి.. లక్షలు లాగేసి!
ABN , Publish Date - May 10 , 2025 | 12:11 AM
పిఠాపురం, మే 9 (ఆంధ్రజ్యోతి): అమరావతి నుంచి ఆఫీసరును మాట్లాడుతున్నాను. మాట్లాడేది పలానా వారేనా, మీకు గతంలో పనిచేసిన వాలంటీరు ఎలాంటి వారు.. మీకు గతేడాది అ మ్మఒడి పడలేదు. ఈ ఏడాదితో కలిపి పడాలంటే నేను చెప్పినట్టు చేయండి అంటూ వాట్సాప్ షేరింగ్, ఫోన్ పేకు మొదట రూపా

‘అమ్మ ఒడి’ పేరుతో టోకరా
అమరావతి నుంచి ఆఫీసరును మాట్లాడుతున్నానంటూ ఫోన్లు
ఖాతాల నుంచి సొమ్ములు మాయం
బాధితులందరిదీ పిఠాపురం నియోజకవర్గం
పిఠాపురం, మే 9 (ఆంధ్రజ్యోతి): అమరావతి నుంచి ఆఫీసరును మాట్లాడుతున్నాను. మాట్లాడేది పలానా వారేనా, మీకు గతంలో పనిచేసిన వాలంటీరు ఎలాంటి వారు.. మీకు గతేడాది అ మ్మఒడి పడలేదు. ఈ ఏడాదితో కలిపి పడాలంటే నేను చెప్పినట్టు చేయండి అంటూ వాట్సాప్ షేరింగ్, ఫోన్ పేకు మొదట రూపాయి పంపి ఆపై ఓటీపీ చెప్పించుకుని బ్యాంకు ఖాతాలు నుంచి సొమ్ములు లా గేసి టోకరా వేశాడు ఒక వ్యక్తి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గురు, శుక్రవారాల్లో పలువురికి ఇదే విధమైన ఫోన్లు వచ్చి రూ.2లక్షలకు పైగా మోసపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పిఠాపురం పట్టణం, మండలంలోని గోకివాడ, విరవాడ తదితర గ్రామాలు, గొల్లప్రోలు పట్టణాలకు చెందిన పలువురు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్లు వచ్చాయి. అమరావతి నుంచి ఆఫీసరును మాట్లాడుతున్నానని పరిచయం చేసుకుని, తొలుత గతంలో పనిచేసిన వలంటీర్ల పనితీరు గురించి ఆరా తీశా డు. వారితో మాట్లాడుతూనే వలంటీర్లను లైన్లోకి తీసుకున్నాడు. ఆపై మీకు గతేడాది అమ్మ ఒడి రాలేదు మీ బ్యాంకు ఖాతాలో, ఆన్లైన్లో సమస్య ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందం టూ చెప్పారు. (గతేడాది ఎవ్వరికి అమ్మఒడి ని ప్రభుత్వం వేయలేదు). వచ్చే నెలలో మళ్లీ అమ్మఒడి పడుతుందని, మీ ఖాతాలకు రెండేళ్ల సొమ్ములు రూ.30వేలు రావాలంటే తాను చెప్పినట్టు చేయాలని సూచించాడు. ఇది నిజమేనని నమ్మి వాట్సాప్ షేరింగ్, ఫోన్ లింకింగ్ ఆప్షన్లకు ఓకే చెప్పారు. అదే సమయంలో ఫోన్లు చేసిన వారి ఫోన్ పేకు లేకుంటే తెలిసిన వారి ఫోన్ పే ఖాతాలకు రూపాయి పంపాడు. ఇప్పుడు మీరు ఆ తర్వాత వచ్చే లింక్ను క్లిక్ చేసి ఓటీపీ చెప్పాలని కోరగా వారు చెప్పేశారు. ఈ విధంగా గోకివాడకు చెందిన రాంబాబు అనే వ్యక్తి ఖాతా నుంచి రూ.36వేలు, బాలాజీ నుంచి రూ.8వేలు, అంజి నుంచి రూ.5వేలతో పాటు సుమారు 24 మంది నుంచి రూ.2వేల నుంచి 40వేల వర కూ సుమారు రూ.2లక్షలకు పైగా సొమ్ములను బ్యాంకు ఖాతాలు నుంచి లాగేశాడు. ఖాతాలు నుంచి సొమ్ములు మాయం కావడంతో మోసపోయామని గుర్తించిన వారు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆ వ్యక్తి నేరుగా అమ్మఒడి లబ్ధిదారులకే ఫోన్ చేయడం, అదే సమయంలో వలంటీర్లకు ఫోన్లు కలపడం వంటివి చేయడం తో ఇతను గత ప్రభుత్వంలో పనిచేసి ఈ వివరాలను తీసుకుని ఇప్పుడు ఫోన్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వ్యవహారం పిఠాపురం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారడం తో పాటు జనసేన పార్టీ తరపున ఇటువంటి ఫోన్లకు ఎవ్వరు స్పందించవద్దంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం సాగిస్తున్నారు.