కనుల పండువగా భావనారాయణస్వామి తెప్పోత్సవం
ABN , Publish Date - May 15 , 2025 | 12:27 AM
సర్పవరం జంక్షన్, మే 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాకినాడ రూరల్ మండలం సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావ నారాయణస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ఎనిమిది రోజులుగా శోభాయమానంగా జరుగుతు న్నాయి. ముగింపు వే
సర్పవరం జంక్షన్, మే 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాకినాడ రూరల్ మండలం సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావ నారాయణస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ఎనిమిది రోజులుగా శోభాయమానంగా జరుగుతు న్నాయి. ముగింపు వేడుకల్లో భాగంగా బుధవారం ఈవో మాచిరాజు లక్ష్మీనారా యణ ఆధ్వర్యంలో ఆలయం ఎదురుగా గల ముక్తికా సరస్సులో తెప్పోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. విద్యు ద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిది ద్దిన తెప్ప (హంస వాహనం)పై స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో విహరిస్తుండగా అధిక సంఖ్యలో భక్తులు తిలకించి పులకించారు. తొలిసా రిగా తెప్పోత్సవం నిర్వహించిన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఈవో లక్ష్మీనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్ పుల్ల శ్రీరాములు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.